జిల్లా రైతులకు న్యాయం చేయాలి అధికారులకు మిమ్మల్ని సమర్పించిన మిడతల రమేష్

 జిల్లా రైతులకు న్యాయం చేయాలి అధికారులకు మిమ్మల్ని సమర్పించిన మిడతల రమేష్ 




నెల్లూరు సిటీ మేజర్ న్యూస్ 

నెల్లూరు జిల్లా రైతులు మద్దతు ధర కోల్పోయి  ధాన్యాన్ని నష్టానికి తెగనమ్ముకుంటున్న అధికారులురైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నెల్లూరు జిల్లా పౌర సరఫరాల సంస్థ అసిస్టెంట్ మేనేజర్ సురేంద్రకు బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ మెమోరాండం ఇచ్చారు* 

ఈ సందర్భంగా మిడతల రమేష్ మాట్లాడుతూ..

కేంద్రం ప్రకటించిన కనీస.మద్దతు ధర 19750 రూపాయలు ఉండగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రైతాంగం 16 వేల రూపాయలకు ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో

వ్యవసాయ కోతల సీజన్ ప్రారంభమైన ఇప్పటివరకు సంబంధిత అధికారులు రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల బాట పట్టారు .

నెల్లూరు జిల్లాలో గత వారం నుండి వరి కోతల ప్రారంభమయ్యాయి. తమ పంటను బిపిటి 16 వేల రూపాయలకు 

కేఎన్ ఎం 17వేల రూపాయలకు విక్రయించుకుంటున్నారు 

కొంతమంది మిల్లర్లు తేమతో సంబంధం లేకుండా 18 వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది .

ఈ సీజన్లో వ్యవసాయ పెట్టుబడులు రైతులు అధికంగా పెట్టారు. దిగుబడి కూడా గతంలో కంటే తక్కువగా వస్తూ ఉంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రైతులు వ్యవసాయం అంటే భయపడే పరిస్థితి ఉంది. 

మరో 10 -15 రోజుల్లో జిల్లాలో ధాన్యం కోతలు ముమ్మరంగా జరుగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నిర్లక్ష్యం వహించింది. కనీసం మిల్లర్ల -రైతుల సమావేశం నిర్వహించి వాస్తవ సమస్యను అర్థం చేసుకోలేదు.

రైతు ప్రయోజనాలు కాపాడటం కోసం యుద్ధ ప్రాతిపదికన రైతు సేవ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతన్నలను ఆదుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో నీలిచంటి లక్ష్మీనారాయణ ముని సురేష్ రాజేంద్ర కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget