ఘనంగా తెలుగు భాష దినోత్సవo
రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం:మండల కేంద్రంలోని బిసి గురుకుల పాఠశాల మరియు ఏ కోళ్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా తెలుగు భాష దినోత్సవం మరియు క్రీడా దినోత్సవం జరుపుకున్నారు అనంతరం ముందుగా గిడుగు రామ్మూర్తి పంతులు మరియు మేజర్ ధ్యాన్ చందు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతయ్య మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని పరిష్కరించుకొని ఆయన తెలుగు భాషకు చేసిన కృషిని కొనియాడారు వ్యవహారి భాష కోసం గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషిని తెలుగు ఉపాధ్యాయుడు మురళీధర్ చక్కగా వివరించడం జరిగినది అలాగే మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని ఆయన భారతదేశానికి క్రీడలకు చేసిన సేవలను వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ సుప్రజ లు కొనియాడారు అనంతరం జరిగిన విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసినారు ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించినారు కార్యక్రమంలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సి. నర్సింగరావు మరియు ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.