తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ మనవడికి గాయాలు రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం :- మండల పరిధిలోని మావిళ్ళపాడు గ్రామంలో శనివారం రాత్రి జరిగిన తండ్రి సుబ్బయ్య కొడుకు సుబ్రమణ్యం మధ్య జరిగిన ఘర్షణలో సుబ్బయ్య కుమార్తె కుమారుడు మనవడు నాగచైతన్యకు గాయమైనది వివరాల మేరకు సుబ్బయ్య కుమార్తె గ్రామంలో ఉన్న భూమి విషయముపై వాటంబేటి సుబ్బయ్య కుమారుడు వాటంభేటీ సుబ్రహ్మణ్యం ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది దీంతో ఈ వివాదం ఆపేందుకు సుబ్బయ్య మనవడు నాగచైతన్య వారి మధ్యలో దూరి గొడవలు ఆపండి అంటూ సర్దపెట్టే సమయంలో నాగచైతన్యకు మెడపై రక్త గాయమైనది దీంతో గాయపడిన నాగచైతన్యను ఆదివారం సూళ్లూరుపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు అయితే ఈ రక్త గాయం తగులుటకు తండ్రీ కొడుకుల చేతులలో కత్తెర ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే కత్తెర తండ్రి చేతిలో ఉన్నదా కొడుకు చేతిలో ఉన్నదా అన్న విషయం మాత్రం తెలియలేదు తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో కత్తెరతో దాడి చేసుకున్నట్లుగా తెలుస్తుంది దీంతోనే నాగచైతన్యకు రక్త గాయం అయినట్లుగా ఉంది
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.