రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో గురువారం చిట్టమూరు మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన డమ్మాయి వెంకయ్య అనే వికలాంగునికి ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడు చేతుల మీదుగా ట్రై సైకిల్ ని చిల్లకూరు మండలం చేడిమాల గ్రామంలో అందజేశారు.ఈ సందర్బంగా ఆయనమాట్లాడుతూ...పేదలకు విద్య,వైద్యంతోపాటు ఆర్ధిక సాయం అందించేందుకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఎల్లవేళలా ముందుంటుందని ఆయన తెలియజేశారు.పేదలకు సేవచేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.ఇంకా ఎవరైనా వికలాంగులు ఉంటే ట్రై సైకిల్స్ కోసం తమ ట్రస్టును సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాబు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.