చర్ల మండలంలో భారీ ఎన్ కౌంటర్.
పోలీసులు , మావోయిస్టులు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు..
ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.. అందులో ఇప్పటివరకు చెర్ల ఏరియా మిలటరీ కమాండర్ మధు చనిపోయినట్టు గుర్తించిన పోలీసులు. మిగతా మావోయిస్ట్ లను గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొనసాగుతున్న కూబింగ్ ఆపరేషన్....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:చర్ల మండలం లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు , ఈరోజు తెల్లవారుజాము నుంచి చర్ల సమీపంలో ఉన్న చెన్నాపూర్ అడవులలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు , ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు అలాగే చత్తీస్ ఘడ్ పోలీసులు అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. గత పది రోజుల క్రితం తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి చర్ల మండలంలోని అడవుల్లో రహస్యంగా పర్యటించి పోలీసులకు నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ ప్రారంభం కాగా పది రోజుల వ్యవధిలోనే భారీ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. చర్ల మండలం లోని మావోయిస్టులు తిరుగుతున్నట్లుగా, మకాం వేసినట్లుగా సమాచారం అందుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ మావోయిస్టుల ఏరివేతకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే డీజీపీ రహస్య పర్యటన చేసినట్లు సమాచారం. పది రోజుల వ్యవధిలో భారీ ఎన్కౌంటర్ జరగడం, ఆరుగురు మావోయిస్టులు మృతి చెందడం పోలీస్ వర్గాలు ఒక చర్చ జరుగుతుంది. కచ్చితంగా డీజీపీ ఫ్లాన్ సక్సెస్ అయినట్లు సమాచారం.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.