తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నెల్లూరులో వైసీపి కార్యకర్తలు టిడిపి కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. మంగళగిరి టిడిపి కార్యాలయంలో పట్టాభి విలేకరుల సమావేశం అనంతరం ఆ కార్యాలయంపై జరిగిన దాడి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో టిడిపి కార్యాలయాల వద్ద వైసీపి నేతలు ఆందోళనలు చేపట్టారు. నెల్లూరులో ముందుగానే పసిగట్టిన టిడిపి నేతలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముందుగానే పోలీసులు టిడిపి కార్యాలయం వద్దకు చేరుకుని బారీకేడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది వైసీపి కార్యకర్తలు అక్కడకు చేరుకుని బారీకేడ్లను తోసుకుని టిడిపి కార్యాలయం ప్రధాన గేటు వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని దూరంగా నెట్టుకుంటూ తీసుకెళ్లారు. తర్వాత వైసీపి కార్యకర్తలు నినాదాలు చేయగా... అప్పుడే అక్కడికి చేరుకున్న టిడిపి కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన పోలీసులు వైసీపి కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.