దేశంలోనే ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమై ఏడాది పూర్తిచేసుకున్నందుకు సూచికగా శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లతో సచివాలయ సిబ్బంది, వలంటీర్లను ప్రోత్సహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శక పాలన అందించడంతో పాటు కరోనా వ్యాధి నివారణలో అహర్నిశలు శ్రమిస్తున్న గ్రామ/వార్డు వలంటీర్లు, కార్యదర్శుల సేవలు అభినందనీయం అని కమిషనర్ ప్రకటించారు. సచివాలయం వ్యవస్థలోని వలంటీర్లు, కార్యదర్శుల సమన్వయంతో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రణాళికాబద్ధంగా అందజేస్తున్నామని, సచివాలయ వార్షికోత్సవంలో ప్రజలంతా భాగస్వాములై శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లతో ప్రోత్సాహం అందించాలని కమిషనర్ ఆకాంక్షించారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.