ఆలు పెరగని భగీరధుడు నాగార్జున రావు.
ఎంతోమందికి మార్గదర్శి, మాంబట్టు సెజ్ లో ఒక దిక్సూచి.
సేవా దృక్పథం కలిగిన మానవతావాది, చుట్టుపక్కల గ్రామాలలో చేసిన సేవ ఎంతో?
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట/ తడ:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నం నుంచి కార్మికుడిలా వచ్చి కర్షకుడిలా మారిన వైనం,1989 లో తడ మండలం మాంబట్టు సెజ్ లో మూత పడుతున్న కంపెనీని కొని కార్మికుడిలా వచ్చి తన ఆలోచన నైపుణ్యంతో
2007 లో
భారత్ సర్క్యూట్ కంపెనీతో మొదలుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ అనేకమంది కార్మికులకు దారి చూపించిన మహోన్నత వ్యక్తి నాగార్జున రావు.
కృషితో ఏదైనా సాధించవచ్చని పట్టుదల కలిగిన వ్యక్తి నాగార్జున రావు. పదిమందికి ఉపాధి కల్పించాలన్న తన కలను సహకారం చేసుకొని,ఇద్దర మిత్రుల ఆర్థిక సహాయంతో
5 కోట్ల పెట్టుబడితో సర్క్యూట్ బోర్డుల తయారీ కంపెనీ మొదలుపెట్టారు.150 మందికి ఉపాధి కల్పించి అనేకమందికి ఆదర్శంగా నిలిచారు. గతంలో నాగార్జున రావు ఇదే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తూ మూతపడుతున్న అదే కంపెనీ తిరిగి కొని యజమాని స్థానానికి చేరుకున్నాడు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పుట్టి పెరిగి ఎలక్ట్రికల్ డిప్లమో చేశారు. నేటి ఈ స్పీడ్ ప్రపంచానికి సర్క్యూట్ బోర్డులు అవసరం ఎంతైనా ఉందని గుర్తేరిగి ఈ రంగాన్ని ఎంచుకొని అభివృద్ధి పథంలో దూసుకుపోయాడు. అమెరికన్ యూనివర్సిటీ ద్వారా చెన్నై లో డాక్టరేట్ తీసుకొని, ఇంటలిజెంట్
ఇండస్ట్రియల్ లిస్ట్ ద్వారా ఊటీలో అవార్డు తీసుకొని ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న వ్యక్తి టి నాగార్జున రావు.
సేవా దృక్పథం కలిగిన మహోన్నత వ్యక్తి నాగార్జున రావు
మాంబట్టు సెజ్ లో కంపెనీ మొదలు పెట్టినప్పుడు నుండి చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్కూళ్లకు, స్కూల్లలో చదివే పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తూ, కార్మికుల కుటుంబాలలో ఏ చిన్న సమస్య ఉన్న ఆర్థికంగా సహాయం చేసే వ్యక్తి నాగార్జున రావు. చదువుకొని ఖాళీగా ఉన్న ఎంతోమంది నిరుద్యోగులకు సపోర్ట్ గా ఉంటూ భరోసా ఇచ్చిన వ్యక్తి నాగార్జున రావు.